Spread The Love

ములుగు డిసెంబర్ 2 (నేటి దర్శిని):
ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాజేడు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


ఈ ఘటన ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలోని ఓ రిసార్ట్‌లో జరిగింది. ములుగు జిల్లాలో నిన్న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ తరువాత ఈ ఆత్మహత్య చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హరీశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియకున్నా, ఈ ఘటన పోలీస్‌ శాఖను షాక్‌కు గురి చేసింది.


ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.