Spread The Love

హైదరాబాదులో రాజ్ కుమార్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన గ్రామస్తులు

నారాయణపేట మే16 (నేటి దర్శిని):
నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డిని శుక్రవారం ఉదయం గ్రామస్థులు హైదరాబాదులోని ఫౌండేషన్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. జూన్ 1, 2, 3వ తేదీల్లో జరిగే శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి దేవతామూర్తుల విగ్రహాలను ఇప్పించాలని వారు కోరగా, అందుకు రాజ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో డాక్టర్ హన్నిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.