డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం


నారాయణపేట జూన్18 (నేటి దర్శిని): నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరకు ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులతో కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని శాలువలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, గ్రామస్తులతో పాటు ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, నందుకుమార్, వై.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.