హైదరబాద్, న్యూస్ డెస్క్ (నేటి దర్శిని):
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక ముందడుగు వేసింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ అధికారికంగా ఒక జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) విడుదల చేసింది. ఈ వర్గీకరణ ప్రకారం ఎస్సీ శ్రేణిని మూడు గ్రూపులుగా విభజించింది – గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. ప్రతి వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ హక్కులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-ఏ వర్గంలోకి వచ్చే ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్, గ్రూప్-బీ వర్గానికి చెందిన వారికి 9 శాతం రిజర్వేషన్, గ్రూప్-సీ వర్గానికి 5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. ఈ జీవో అమలులోకి రావడంతో రాష్ట్రంలోని ఎస్సీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సంవత్సరాలుగా కొనసాగిన డిమాండ్లకు ఇది సమాధానమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకంగా ఎస్సీ ప్రజాపక్షాల్లో ఎలాంటి ప్రభావం చూపనుందన్నది ఆసక్తికర అంశంగా మారింది.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో జారీ చేసిన ప్రభుత్వం
