రూ.1.35 లక్షలతో సజనాపూర్ గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు భీష్మరాజ్ ఫౌండేషన్
డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డికి దారి పొడువున ఘన స్వాగతం

నారాయణపేట ఏప్రిల్09 (నేటి దర్శిని):
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం సజనాపూర్ గ్రామంలో బొడ్రాయి పండుగ ఘనంగా జరిగింది. అదే విధంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ముందు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని బుధవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థులంతా కలిసి ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణం చేపట్టారని, ధ్వజస్తంభ నిర్మాణానికి సహకరించాలని తమను కోరిన వెంటనే రూ.1.35 లక్షలతో ధ్వజస్తంభ నిర్మాణాన్ని చేపట్టి దేవాలయ నిర్వాహకులకు అందజేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవానికి తమను ఆహ్వానించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా ఆధ్యాత్మికను పెంపొందించుకోవాలని కోరారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డిని దేవాలయ నిర్వాహకులు, గ్రామస్థులు శాలువలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు సి.మాణిక్యప్ప, కనకప్ప, నర్సప్ప, వెంకటేష్, షరీఫ్, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, హన్మంతు, గోపాల్ గౌడ్, రుద్రారెడ్డి, వై.సంతోష్, అశోక్, ఎం.సంతోష్, నందుకుమార్, చామకూర నగేష్, ప్రవీణ్, విజయ్, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

మాణికేశ్వరి మాత ఆలయంలో పూజలు

సజానపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మాణికేశ్వరి మాత ఆలయానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి రూ.50 వేలను విరాళంగా ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న దేవాలయంలో బుధవారం రాజ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవాలయాన్ని సందర్శించినరాజ్ కుమార్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ నిర్వాహకులు ఆనంద్, మహిళలు పాల్గొన్నారు.
