ఘనంగా నివాళులర్పించిన నల్గొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ
తెలంగాణ పోరాట చరిత్రలో పోలీస్ కిష్టయ్య చరిత్ర నిక్లిప్తం

నల్గొండ బ్యూరో డిసెంబర్ 1 (నేటి దర్శిని): తెలంగాణ మలిదశ పోరాట చరిత్రలో పోలీస్ కిష్టయ్య త్యాగం, చరిత్ర ఎప్పటికీ నిక్లుప్తంగా దాగివుంటుందని నల్గొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు కొనియాడారు. నల్గొండ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వెలుగు రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రం గడియారం వద్ద అమరవీరుల స్తూపం నీకు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ చిత్రపనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారుు. అనంతరం వారు మాట్లాడుతూ….. తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వీరుడు పోలీస్ కృష్ణయ్య ముదిరాజు తెలంగాణ సాధించిన తర్వాత వారి విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ముదిరాజుల చిరకాల కోరిక బీసీ డీ నుండి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ… తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు తొలి అమరుడు విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిన మహానీయుడు, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాదని ఆందోళన ఆందోళన చెందుతూ టవర్ ఎక్కి వారి యొక్క తుపాకితో కాల్చుకొని అమరుడైన పోలీస్ కృష్ణకు జోహార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్దలు కేశబోయిన శంకర్ ముదిరాజు, లోకనబోయిన రమణ ముదిరాజ్, వెలుగు యాదయ్య ముదిరాజ్, పాముల అశోక్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండబోయిన రాములు ముదిరాజు, గుర్రంపోడు మండల అధ్యక్షులు జిల్లబోయిన యాదయ్య ముదిరాజ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ కోట్ల సైదులు ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోట్ల సునీతా దేవి ముదిరాజ్, గీతా ముదిరాజ్, చామ్లేడు గ్రామ సర్పంచ్ మాజీ చాడ చక్రవర్తి ముదిరాజ్, బైరు బలరాం ముదిరాజ్, మాడుగుల పల్లి మండల అధ్యక్షులు తవిటి సైదులు ముదిరాజ్, గుండబోయిన లింగయ్య ముదిరాజ్, సిద్ధం వెంకన్న ముదిరాజ్, నిమ్మల సైదులు ముదిరాజ్, మర్రి శ్రీనివాస్ ముదిరాజ్, తోట మధు ముదిరాజ్, రాజు ముదిరాజ్, పాండు ముదిరాజ్, తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.