5K రన్ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన తెలంగాణా రాష్ట్ర సీఎంఓ వేం రెడ్డి నరేందర్ రెడ్డి
హైదరాబాద్/నేటి దర్శిని: తెలంగాణ విద్య సమితి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణా కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్డు నందు డిసెంబర్ 20 నా నిర్వహించనున్న 5K రన్ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన తెలంగాణా రాష్ట్ర సీఎంఓ వేం రెడ్డి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమములో నల్గొండ డీసీసీ పూన్న కైలాష్ నేత,తెలంగాణా విద్య సమితి అధ్యక్షులు పెండెం తారక్ గౌడ్, మేడ్చల్ జిల్లా ST సెల్ అధ్యక్షులు గణేష్ నాయక్_ , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా OC JAC కన్వీనర్ శ్యామ్ రెడ్డి, ఓబిసి పీపుల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి రాజు ఇతర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.
