“నేటి దర్శిని” తెలుగు దినపత్రికను ఆవిష్కరించిన ఎల్బీనగర్ డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్
నేటి దర్శిని ఎడిటర్ కట్ట సత్యనారాయణ




హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి నవంబర్15(నేటి దర్శిని): ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ జోన్ డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో నేటి దర్శిని తెలుగు దినపత్రికను ఎడిటర్ కట్ట సత్యనారాయణతో కలిసి డీసీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ….. నేటి ఆధునిక యుగంలో పత్రికారంగం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ గ్రామీణ స్థాయిలో ప్రజలకు అనేక అంశాలపై అవగాహన పూర్తిస్థాయిలో రాకపోవడం నిరుత్సాహకరాంశమేనన్నారు. గ్రామస్థాయిలో నేటి యువతరం ముందుకు వచ్చి విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, సమాజం పట్ల పౌరుల బాధ్యత ఇతరత్రా అంశాల్లో పత్రికలు చేస్తున్నటువంటి కృషికి యువతరం తోడ్పాటున అందిస్తే ప్రజా అభివృద్ధి సాధ్యమేనని ఈ సందర్భంగా డీసీపీ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యానికి నేటి దర్శిని తెలుగు దినపత్రిక అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రిక తోడ్పాటున అందించాలని డీసీపీ ఆకాంక్షించారు. అనంతరం పత్రిక ఎడిటర్ కట్ట సత్యనారాయణ మాట్లాడుతూ……. నేటి దర్శిని తెలుగు దినపత్రిక ప్రజా చైతన్యం కోసం గ్రామస్థాయి నుండి ప్రజలను చైతన్య పరచడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. నేటి దర్శిని తెలుగు దినపత్రిక అక్షర శోధనలో ప్రతి అక్షరాన్ని ప్రజా చైతన్యం కోసం నిరంతరం విధులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. నేటి దర్శిని తెలుగు దినపత్రికను ఆవిష్కరించిన డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ను పత్రికా ఎడిటర్ కట్ట సత్యనారాయణ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ డైరీ తెలుగు దినపత్రిక ఎడిటర్ శ్రీరాములు, జర్నలిస్ట్ బిక్షం గౌడ్, బి.జె.పీ.నాయకులు శశిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.