నారాయణపేట ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు
నారాయణపేట, మార్చి31 (నేటి దర్శిని):
రంజాన్ పర్వదినం సందర్భంగా నారాయణపేట పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పండుగలు అన్ని వర్గాల ప్రజల్లో సోదరభావాన్ని నింపుతాయని అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం పెద్దలను శాలువలతో రాజ్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పోలీస్ పటేల్ సుదర్శన్ రెడ్డి, శివరాజ్, రుద్రారెడ్డి, గోపాల్, కృష్ణయాదవ్, నర్సింహనాయుడు, వై.సంతోష్, హన్మంతు, బసుదే అశోక్, మేంగ్జి నందుకుమార్, అనిల్, ఎం.సంతోష్, చామకూర నగేష్, నగరి నాగురావు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.