త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామన్న ఎన్టీఏ
మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం
న్యూస్ డెస్క్ (నేటి దర్శిని):వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంచలన ప్రకటన చేసింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో రద్దు చేసిన కేంద్రం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపింది.