అశోక్నగర్ లో అమ్మవారి విగ్రహ ఏర్పాటు, అన్నదానానికి రూ.30వేల విరాళం
రాజ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అశోక్నగర్ వాసులు సల్లంగ ఉండాలని మహిళల దీవెనలు నారాయణపేట, సెప్టెంబర్29 (నేటి దర్శిని): శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట పట్టణంలోని అశోక్నగర్ లో నెలకొల్పిన అమ్మవారి మండపంలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ అశోక్నగర్ లో మహిళలు గత కొన్నేళ్లుగా శ్రీదేవీ శరన్నవరాత్రి...