Newspaper Banner
Date of Publish : 29 August 2025, 4:13 pm Digital Edition : Unknown Author

శేర్నపల్లిలో బొజ్జ గణపయ్యకు పూజలు చేసిన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని):
వినాయక చవితి సందర్భంగా నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం శేర్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య మండపంలో శుక్రవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి… గ్రామస్థులతో, ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని మండప నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, గోపాల్ గౌడ్, సల్ల వెంకటేష్, వై.సంతోష్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, కృష్ణయాదవ్, నాగురావు, అశోక్, చామకూర నగేష్, నర్సింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.